అల్లు అర్జున్, రష్మికా మందన్న జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించగా.. ప్రకాష్ రాజ్, అనసూయ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ ఫార్ట్ `పుష్ప ది రైజ్` భారీ అంచనాల నడుమ నిన్న అట్టహాసరంగా విడుదలైంది.
ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పుష్ప రాజ్గా బన్నీ వన్ మ్యాన్ షో చేశాడు. లుక్ పరంగానే కాదు నటన పరంగానూ బన్నీ మిస్మరైజ్ చేశాడు. ఇక పాలు అమ్ముకునే మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవల్లీ పాత్రలో రష్మిక ఒదిగిపోయింది. అయితే పుష్పకు పెద్ద మైనస్గా మారింది ఏంటీ అంటే సినిమా నిడివి.
ఆల్రెడీ రెండు భాగాలుగా చేయాలని ఫిక్స్ అయినప్పుడు.. మొదటి భాగం క్రిస్పీగా ఉండుంటే బాగుండేది. నిడివి తగ్గి ఉంటే.. సినిమా ఎక్కడా ‘తగ్గేదేలే’ అనిపించేది. కానీ, సుకుమార్ మూడు గంటల నిడివితో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. ఇప్పుడదే పుష్పకు శాపంగా మారింది. ముఖ్యంగా బన్నీ, రష్మిక ట్రాక్ అంతా ఆకట్టుకోకపోగా.. ప్రేక్షకులకు విసుగు పుట్టించాయని విశ్లేషకులు అంటున్నారు.
వీరిద్దరి లవ్ ట్రాక్ను సినిమాలో బాగా ఇరికించినట్లు ఉందని టాక్ బచటకు వచ్చింది. రెండో భాగంలోనూ కొన్ని సన్నివేశాలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాయి. ఈ నేపథ్యంలోనే సుకుమార్ సినిమాలో రష్మికకు సంబంధించిన పలు సన్నివేశాలను మరియు ప్రేక్షకులకు బాగా విసుగు పుట్టించిన సన్నివేశాలను ట్రిమ్ చేసి లేపేయాలని నిర్ణయించుకున్నట్లు టాక్. మరి ఇదే నిజమైతే రష్మిక ఫ్యాన్స్కి షాక్ తప్పదు.