అమ‌ల రీ ఎంట్రీ.. ఊహించ‌ని కామెంట్స్‌తో భార్య‌కు నాగార్జున షాక్‌..!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, కింగ్ నాగార్జున స‌తీమ‌ణి అమ‌ల అక్కినేని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భారతీరాజా దర్శకత్వం వహించిన `వైశాలి` అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోనికి ప్రవేశం చేసిన అమ‌ల‌.. తెలుగులో నాగార్జున హీరోగా డి.రామానాయుడు నిర్మించిన `చినబాబు` చిత్రం ఎంట్రీ ఇచ్చింది.

ఈ సినిమాతోనే నాగార్జున‌, అమ‌ల మ‌ధ్య ఏర్పిడిన ప‌రిచ‌యం ప్రేమ‌, ఆపై పెళ్లి వ‌ర‌కు దారి తీసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సినిమాల‌కు దూర‌మైన అమ‌ల‌.. ఫ్యామిలీని చూసుకుంటూ ఇంటికే ప‌రిమితం అయింది. ఆ త‌ర్వాత ఎన్నో ఏళ్ల‌కు `లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్` సినిమాలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించిన అమ‌ల‌.. `మ‌నం`లో మూవీలో మెరిసింది.

ఇక మ‌ళ్లీ అమ‌ల సిల్వ‌ల్ స్క్రీన్‌పై క‌నిపించ‌లేదు. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత అమ‌ల రీ ఎంట్రీ ఇచ్చింది. ఈమె వెండితెరపై పూర్తి స్థాయిలో కనిపించ‌బోతున్న చిత్రం `ఒకే ఒక జీవితం`. శ‌ర్వానంద్, రితూ వ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న ఈ చిత్రం ద్వారా శ్రీ కార్తీక్ దర్శకుడిగా ప‌రిచయం అవుతున్నాడు.

ట్రైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకున్న ఈ మూవీలో శ‌ర్వాకు అమ్మ‌గా అమ‌ల న‌టించింది. నిన్న ఈ మూవీ టీజ‌ర్ విడ‌ద‌ల అవ్వ‌గా.. దానికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక‌పోతే అమ‌ల రీ ఎంట్రీ ఇవ్వ‌డంపై నాగార్జున ఊహించ‌ని కామెంట్స్ చేసి భార్య‌కు షాక్ ఇచ్చాడు. తాజాగా `నిన్ను మళ్ళీ తెరపై చూడడం ఆనందంగా ఉంది అమల. ఒకే ఒక జీవితం మూవీ టీమ్ కు ఆల్ ది బెస్ట్` అంటే నాగ్ ట్వీట్ చేశారు. నాగ్‌ చేసిన ట్వీట్‌కు, ఆయ‌న ప్రోత్సాహానికి అమ‌ల ఆనందంతో ఉప్పొంగిపోయింద‌ట‌.

https://twitter.com/iamnagarjuna/status/1476179786351349766?s=20