కరోనా మరొకసారి తన ప్రభావాన్ని చూపిస్తోంది.మొన్నటివరకు కరోనా కేసులు తగ్గాయి అని ఆనందించే లోపు.. ఒక్కసారిగా కరోనా బారిన పడిన కేసులు కాస్తా విపరీతంగా పెరిగిపోయాయి. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. మహేష్ వదిన, నమ్రత అక్కయినా.. శిల్పా శిరోద్కర్ కరోనా బారిన పడ్డారు. ఇక ఇందులో శిల్ప కూడా ఒకనాటి బాలీవుడ్ నటి.
ప్రస్తుతం శిల్పా దుబాయ్ లో నివసిస్తున్న ది. శిల్పాకు నమ్రత, మహేష్ కు మధ్య ఎంతటి అనుబంధం ముందు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మహేష్ బాబు, నమ్రత ఏ పార్టీ చేసుకున్న కచ్చితంగా శిల్ప ఉండాల్సిందే. అయితే గడిచిన నాలుగు రోజులనుంచి శిల్ప కరోనాతో పోరాటం చేస్తున్నట్లుగా.. సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉండండి.. దయచేసి టీకాలు వేసుకోండి మరియు అన్ని నియమాలను పాటించండి అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ కి నమ్రత స్పందిస్తూ.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కామెంట్ రూపంలో తెలియజేసింది. ఈ విషయం తెలిసిన అభిమానులు చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు.
https://www.instagram.com/p/CYE-Q5JP6Bh/?utm_source=ig_embed&ig_rid=4443b8a6-15bc-4535-ac70-69b96303c8fe