తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది హీరోయిన్ రాశి. 1990 వ సంవత్సరంలో తొలిసారిగా హీరోయిన్గా అడుగుపెట్టింది. అతి తక్కువ సమయంలోనే 50 సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. ఇక ఆమె తన కెరియర్ లో ఎంత త్వరగా ఎదిగిందో అంతే త్వరగా సినీ ఇండస్ట్రీ నుంచి కనుమరుగై పోయింది.
అయితే ప్రస్తుతం రాశి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తోంది. అయితే రాశీ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది. ఇక ఇదే నేపథ్యంలోనే డైరెక్టర్ తేజ డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా వచ్చిన నిజం సినిమా లో రాశీ చాలా బోల్డ్ క్యారెక్టర్ లో నటించింది. ఈ సినిమా చూసిన ఆమె అభిమానులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గోపీచంద్, రాసి మధ్య కెమిస్ట్రీ చూసి ఇంత బోల్డు ఏంట్రా బాబు అని అందరూ అనుకున్నారట. అప్పట్లో ఈ విషయం బాగా వైరల్ గా మారింది.
అయితే ఈ విషయంపై రాశి మాట్లాడుతూ.. ఆ సినిమా కథ చెప్పేటప్పుడు డైరెక్టర్ తేజ ఒకలా చెప్పి.. సినిమా షూట్ చేసేటప్పుడు మరొకలా చేశారని.. అయితే దీంతో ఆమెకు ఈ క్యారెక్టర్ నచ్చకపోవడంతో సినిమా షూటింగ్ నుంచి వెళ్లిపోతున్నప్పుడు.. తేజ మేనేజర్ ఆమెను ఈ రోల్లోఎలాగైనా నటించాలని బలవంతం చేశారట. ఇక సినిమా ఒప్పుకున్న తర్వాత నేను చేయను అంటే ఇండస్ట్రీలో నన్ను ఒక ఒక చెడ్డ దానిలా ముద్ర వేస్తారని రాసి భయపడి.. ఈ సినిమాలో రాశి బలవంతంగా చేశానని తెలియజేసింది.ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారింది.