ఇప్పటికే భర్త నాగచైతన్యకు, అక్కినేని కుటంబానికి దూరమైన టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత.. త్వరలోనే తన అభిమానులందరికీ కూడా దూరమవ్వబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. విడాకుల అనంతరం తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని పలు యూట్యూబ్ ఛానెళ్లపై సామ్ కోర్టులో పిటీషన్ వేసిన విషయం తెలిసిందే.
అయితే వాదోప వాదాలు విన్న కోర్టు సమంతకు సంబంధించిన కంటెంట్ను తొలగించాలని సదరు యూట్యూబ్ ఛానల్స్ కు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో వ్యక్తిగత విషయాలు సోషల్ మీడియాలో పంచుకోవడం తగ్గించాలని సామ్కి సైతం మొట్టికాయలు వేసింది.
ఈ నేపథ్యంలోనే సమంత ఇకపై సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట. త్వరలోనే ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, పేస్ బుక్ వంటి అకౌంట్స్ డిలీట్ చేయబోతోందని ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ ప్రచారం ఎక్కడ నిజమవుతుందో అని ఆమె ఫ్యాన్స్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు.