బాహుబలి కాజాతో ర‌ష్మిక‌కు స‌త్కారం..నెట్టింట ఫొటోలు వైర‌ల్‌!

అతి త‌క్కువ స‌మ‌యంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక్‌కు తాజాగా బాహుబ‌లి కాజాతో స‌త్కారం చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం ర‌ష్మిక చేస్తున్న చిత్రాల్లో `ఆడవాళ్లు మీకు జోహార్లు`. శ‌ర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.

Suruchi Foods Presented By Tapeswaram Kaja To Sharwanand And Rashmika - Sakshi

ఈ సినిమా షూటింగ్‌ ఆదివారం రాజమహేంద్రవరంలో జరిగింది. అయితే షూటింగ్ నిమ్మిత‌రం ర‌జ‌మ‌హేంద్ర‌వ‌రం వ‌చ్చిన శ‌ర్వానంద్ మ‌రియు ర‌ష్మిక‌ల‌ను తాపేశ్వరంలోని సురుచి ఫుడ్స్‌ బాహుబలి కాజాతో సత్కరించింది. సురుచి పీఆర్‌ఓ వర్మ బాహుబలి కాజాలను శ‌ర్వా, ర‌ష్మిల‌కు అంద‌జేశారు.

ఈ సంద‌ర్భంగా శర్వానంద్‌ మాట్లాడుతూ తనకు మడత కాజా అంటే చాలా ఇష్టమని, గతంలో తాను సురుచిని సందర్శించాని తెలిపారు. మ‌రోవైపు ర‌ష్మిక కూడా బాహుబ‌లి కాజాను చూసి ఎంతో హ్యాపీగా ఫీల్ అయింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.