టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల ప్రేమకు, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చైతు-సామ్లు విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి దారుల్లో వారు బిజీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. సమంత జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` కార్యక్రమంలో పాల్గొంది.
తాజాగా ఈ ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఆకట్టుకుంటున్న ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. పండుగ స్పెషల్ నేపథ్యంలో ఈ నెల 14న జెమినీ టీవీలో సమంత స్పెషల్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుందని తెలుస్తోంది. అయితే ఈ షో వేదికగా సమంత తన పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుందట. ముఖ్యంగా తన విడాకులకు కారణం ఏంటో చెప్పి భర్త చైతు గుట్టు అంతా రట్టు చేసేసిందని ప్రచారం జరుగుతోంది.
మరి ఈ ప్రచారంలో ఎంత వరకు నిజమో తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కాగా, సామ్ కు చై అంటే ఎంతో ఇష్టమని, పిల్లల్ని కనాలని ఎన్నో కలలు కందని, ఫ్యామిలీ కోసమే ఆమె ఎన్నో పెద్ద ప్రాజెక్టులను వదిలేసుకుందని ఈ మధ్య ఆమె వ్యక్తిగత మేకప్ స్టైలిస్ట్ సాద్నా సింగ్ తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే శాకుంతలం నిర్మాత నీలిమ గుణ కూడా సమంత పిల్లలను కనాలనుకుందని చెప్పుకొచ్చింది. దాంతో మొదటి నుంచీ సమంతను టార్గెట్ చేసిన నెటిజన్లు.. ఒక్కసారిగా చైతు వైపు టర్న్ అయ్యారు. చైతునే ఏదో చేశాడని.. సామ్ కలలన్నీ నాశనం చేశాడని కొందరు మండిపడుతున్నారు. మరి ఏది నిజమో..? ఏది అబద్ధమో..? వారిద్దరికే తెలియాలి.