మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు క్లైమాక్స్కు చేరుకున్నాయి. నేటి ఉదయం ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం మూడు గంటల వరకు కొనసాగగా.. మొత్తం 626మంది మా సభ్యులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. సాయంత్రం ఐదు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది.
అయితే ఆ సారి క్రాస్ ఓటింగ్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం పోలైన ఓట్లలో 50 ఓట్లు చెల్లనవిగా ఎలక్షన్స్ కమిషన్ గుర్తించడంలో.. ఇరు వర్గాల్లోనూ టెన్షన్ నెలకొంది. ఇక ఓట్ల లెక్కింపులో ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు.
ఇందులో ఎక్కువ ఓట్లు విష్ణు మంచుకే పడ్డాయి. దాంతో మెయిన్ ఓటింగ్లో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, మరోవైపు కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్, విష్ణుల్లో ఎవరు గెలుస్తారా అన్నదానిపై బెట్టింగ్ లు పెడుతున్నారు. ఎప్పటికప్పుడు ఓటింగ్ శాతాన్ని బెట్టింగ్ రాయుళ్లు తెలుసుకుంటున్నారు.