టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని స్వయంగా సామ్, చైలు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక వీరిద్దరూ విడిపోవడానికి అసలైన కారణం బయటకు రాకపోయినా.. ఇప్పటికే రకరకాల ప్రచారాలు మాత్రం తెరపైకి వచ్చాయి.
ఇదిలా ఉంటే.. `శాకుంతలం` సినిమా నిర్మాత నీలిమ గుణ సమంత గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నీలిమ గుణ సమంత గురించి మాట్లాడుతూ.. `శాకుంతలం సినిమా కోసం ఆమెను సంప్రదించాం. అయితే అప్పటికే ఆమె చిత్రాలను చేయకూడదని ఫిక్స్ అయింది. ఫ్యామిలీ ప్లానింగ్లో ఉన్నానని..లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నానని చెప్పింది.
కానీ పీరియాడిక్ సినిమా, కథ నచ్చడంతో చివరికి ఓకే చెప్పింది. అలాగే త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని కండీషన్ పెట్టింది. ఇక ఆమె కోరినట్టే శాకుంతలం షూటింగ్ను జూలై, ఆగస్ట్లోకెల్లా ఫినిష్ చేశాం` అంటూ చెప్పుకొచ్చారు. ఇక నీలిమ మాటలను బట్టీ చూస్తుంటే సమంత పిల్లలను కనాలనుకోగా.. ఆగస్ట్ నెలలోనే ఏదో జరిగిందని, దాంతో సామ్ కలలు నాశనమయ్యాయని పలువురు భావిస్తున్నారు.