తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు మరి కొన్ని గంటల్లో జరగబోతున్నాయి. సమయం దగ్గర పడుతున్న కొద్దీ వాతావరణం మరింత వాడివేడిగా మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్న మా ఎన్నికల్లో ఇటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్, అటు మంచు విష్ణు ప్యానెల్ గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలతో చేసుకుంటూ తెలుగు ఇండస్ట్రీని హీటెక్కించేస్తున్నాడు.
అలాగే ఎన్నో వివాదాలను కూడా తెరపైకి తేస్తున్నారు. ఇక ప్రకాశ్ రాజ్ ప్యానెల్కి సపోర్ట్ చేస్తున్న మెగా బ్రదర్ నాగబాబు తాజాగా మంచు విష్ణు గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు. నాగబాబు మాట్లాడుతూ.. ప్రకాష్ కింది స్థాయి నుంచి వచ్చాడు.. అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగాడు. నటుడి కష్టాలు ఎలా ఉంటాయో అతడికి తెలుసు. అలాంటి వాడు అధ్యక్షడు అయితేనే నటుల గురించి ఆలోచిస్తాడని చెప్పుకొచ్చాడు.
అలాగే ప్రకాశ్రాజ్ కు నిర్మాతలతో కాంట్రవర్సీలున్నాయి అని చాలా మంది అంటున్నారు. మరి సలీమ్ సినిమా సమయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరికి రెమ్యునరేషన్ ఇవ్వకుండా మంచు విష్ణు మోసం చేయాలేదా.. ? అయన కోర్టు కెక్కిన సంగతి మర్చిపోయారా..? కోర్టు మీకు మొట్టికాయలు వేసిందని తెలుగువాళ్ళకు తెలియదా..? అని నాగబాబు ప్రశ్నించారు. ఆయన పెద్ద దర్శకుడు కాబట్టి ఎదురునిలబడ్డాడు.. మరి సామాన్యుల పరిస్థితి ఏంటి అని నాగబాబు అన్నారు. మొత్తానికి వైవీఎస్ చౌదరి మ్యాటర్ తెస్తూ మంచు విష్ణు పరువంతా తీసేశాడు నాగబాబు.