మహాసముద్రం సెన్సార్ రిపోర్ట్.. ఎలా ఉందంటే?

టాలీవుడ్ కల్ట్ డైరెక్టర్‌గా పేరుతెచ్చుకున్న దర్శకుల్లో యంగ్ డైరెక్టర్ అజయ్ భూపతి కూడా ఒకరు. ఆర్ఎక్స్ 100 చిత్రంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’ ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద ఆర్ఎక్స్ 100 ఫీవర్ తీసుకురావాలని ఈ డైరెక్ట్ చూస్తున్నాడు. కాగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమా తాజాగా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకుంది. మహాసముద్రం చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమా మాస్ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకునే విధంగా ఉందని సెన్సా్ర్ బోర్డు సభ్యులు కితాబిచ్చారు. ఇక ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ నటన ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లిందని, దర్శకుడి ప్రతిభి కూడా ఈ సినిమాను ప్రేక్షకులు మెచ్చే విధంగా తీర్చిదిద్దిందని సెన్సార్ బోర్డు సభ్యులు తెలిపారు.

మొత్తంగా మహాసముద్రం చిత్రానికి సంబంధించి అన్ని పనులు పూర్తవ్వడంతో, ఇక దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి మహాసముద్రం చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.