పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ `భీమ్లా నాయక్`. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో పవన్కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్ నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే నేడు దసరా పండగ సందర్భంగా మేకర్స్ పవన్ ఫ్యాన్స్ కోసం సెకెండ్ సింగిల్ కూడా విడుదల చేశారు. . `అంత ఇష్టం ఏందయ్యా నీకు.. ` అంటూ సాగే ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
రామ జోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటకు ఎస్ఎస్ థమన్ స్వరాలు సమకూర్చగా కేఎస్ చిత్ర ఆలపించారు. ఎంతో వినసొంపుగా ఉన్న ఈ సాంగ్ అభిమానులతో పాటు నెటిజన్లను సైతం ఆకట్టుకుంటూ యూట్యూబ్లో ట్రెండింగ్గా మారుతోంది. కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.