సాయి తేజ్ యాక్సిడెంట్‌కి వేగ‌మే కార‌ణ‌మా..? లేక ఇసుకే శాప‌మైందా..?

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ శుక్రువారం రాత్రి హైదరాబాద్‌లోని కేబుల్ బ్రిడ్జ్ దగ్గర స్పోర్ట్స్ బైక్‌పై నుంచి పడి తీవ్రంగా గాయ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు ఆపోలో హాస్ప‌ట‌ల్‌లో చికిత్స అందిస్తున్నారు. తేజ్‌కు కాలర్ బోన్ విరిగిందనీ..అయినా కంగారు పడాల్సిన పని లేదన్నారు డాక్టర్లు.

Sai Dharam Tej Accident: ప్రమాదానికి కొన్ని క్షణలముందు కేబుల్ బ్రిడ్జ్ పై సాయి ధరమ్ తేజ్.. CCTV దృశ్యాలు | Sai Dharam Tej accident update video of sai dharam tej few minutes before he fell from

అయితే అస‌లు ఈ ప్రమాదం ఎలా జరిగింది..? ఈ ప్రమాదానికి గల కారణాలేంటి..? అన్న ప్ర‌శ్న‌లే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ప్రమాదానికి ఒక్క నిమిషం ముందు దుర్గం చెరువు వద్ద ఉన్న కేబుల్ బ్రిడ్జ్ పై తేజ్ తన బైక్‌తో వేగంగా వెళ్లడాన్ని పోలీసులు గుర్తించారు. దాంతో మితిమీరిన వేగంతో బైక్ నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలుపుతున్నారు.

This Is Sai Dharam Tej Bike .. The Video Related To The Accident Is Viral

అయితే మ‌రోవైపు ప్రమాదం సమయంలో రహదారిపై ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయి పడ్డాడ‌ని, ఇసుక కార‌ణంగానే తేజ్‌ వాహనాన్ని అదుపు చేయలేకపోయాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం అన్ని కోణాల్లోనూ పోలీసులు విచార‌ణ చేప‌ట్టారు. మ‌రి ఈ యాక్సిడెంట్‌కి వేగ‌మే కార‌ణ‌మా..? లేక ఇసుకే శాప‌మైందా..? అన్న‌ది తెలిపాయంటే మ‌రికొన్ని గంట‌లు వెయిట్ చేయాల్సిందే.