స్పెయిన్‌లో 3 వారాలు మకాం వేయ‌బోతున్న మ‌హేష్‌..కార‌ణం అదే!

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు స్పెయిన్‌కి వెళ్ల‌బోతున్నారు. అక్క‌డే మూడు వారాలు మ‌కాం కూడా వేయ‌బోతున్నార‌ట‌. అయితే ఇదేదో ఫ్యామిలీ ట్రిప్ కాదండోయ్‌.. షూటింగ్ ట్రిప్పే. ప్ర‌స్తుతం మ‌హేష్ ప‌రుశురామ్ ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

 సర్కారు వారి పాటలో స్టైలిస్ లుక్‌లో మహేష్ బాబు (Sarkaru Vaari Paata /Youtube/Photo)

కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుద‌ల కానుంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యాన‌ర్ల‌పై సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే దుబాయ్, గోవా, హైద‌రాబాద్‌లో షూటింగ్ చేసిన చిత్రయూనిట్.. నెక్స్ట్ షెడ్యూల్ కోసం స్పెయిన్ దేశానికీ పయనమవ్వనున్నారట.

 Sarkaru Vaari Paata: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ముందుగా ఈ సినిమా టీజర్‌ను ఈ రోజు ఉదయం 9గంటల 9 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ముందుగా టీజర్ లీక్ కావడంతో అనుకున్న సమయం కంటే ముందుగానే టీజర్‌ను విడుదల చేసారు. ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. (Sarkaru Vaari Paata /Youtube/Photo)

దాదాపు మూడు వారాల పాటు అక్కడ చిత్రీకరణ జరపనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌, కీర్తి సురేష్ ఇద్ద‌రూ పాల్గోనున్నార‌ట‌. కాగా, ఈ మూవీకి ఎస్‌.త‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. బ్యాంకింగ్ కుంభకోణంలో ఇరుకున్న తన తండ్రిని కాపాడుకునే కొడుకుగా మహేష్ ఈ చిత్రంలో కనిపించనున్నాడని టాక్.