అక్కినేని వారి కోడలు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఈ రోజు ఉదయం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు.
అనంతరం సమంత గుడిలోంచి బయటకు వెళ్తుండగా.. టీవీ రిపోర్టర్స్లో ఒకరు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట కదా, నిజమేనే..? అంటూ సదరు రిపోర్టర్ ప్రశ్నించగా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అతడిపై ఫైర్ అయ్యారు.
అనంతరం అక్కడ నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. కాగా, గత కొద్ది రోజుల నుంచి సమంత, చైతు డివోర్స్ తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ ప్రచారంపై అటు సమంత, ఇటు చైతు ఇద్దరూ స్పందించడం లేదు. దాంతో వీరిద్దరి మధ్య ఏం జరుగుతుందో తెలియక అందరిలోనూ అయోమయం నెలకొంది.