సమంత.. ఈ పేరు గత కొద్ది రోజులుగా వార్తల్లో నానుతూనే ఉంది. ఇందుకు కారణం ఆమె విడాకులే. నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకోబోతోందంటూ ఎప్పటి నుంచో వార్తలు వెలువడుతున్నాయి. కానీ, ఇప్పటి వరకు ఆ వార్తలను సమంతగానీ, చైతుగానీ ఖండించలేదు. దాంతో మరింత జోరుగా ఈ వార్తలు వైరల్ అయ్యాయి.
అయితే నిన్న ఈ విషయంలో స్పష్టత వస్తుందని అందరూ భావించారు. కానీ, అది జరగలేదు. సమంతా కొంతకాలం కిందట సాకీ పేరుతో ఆన్ లైన్ వస్త్ర వ్యాపారం ప్రారంభించారు. సాకీ స్థాపించి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సమంతా వేడుక చేసుకున్నారు. అంతేకాదు, ఈ సందర్భంగా అభిమానులతో చిట్ ఛాట్ కూడా చేసింది.
దాంతో విడాకులు వ్యవహారంపై నెటిజన్లు, అభిమానులు రకరకాల ప్రశ్నలను సమంతపై వైపు సంధించారు. కానీ, సమంత మాత్రం ఆ ప్రశ్నలన్నిటినీ స్కిప్ చేసి సస్పెన్స్ ని అలానే మెయింటేన్ చేసింది. దాంతో ఆమెపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు విడాకులపై స్పందిస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.