ఆచార్యపై ఆసక్తి తగ్గుతుందా?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు చిరు రెడీ అవుతున్నాడు. కాగా ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ప్రేక్షకులు మెచ్చే విధంగా ఉండబోతుందని చిత్ర యూనిట్ మొదట్నుండీ చెబుతూ వస్తోంది.

కాగా ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ తొలుత ప్లాన్ చేసింది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను దసరా బరిలో రిలీజ్ చేస్తారని ప్రేక్షకులు ఆశించారు. కానీ వారికి మరోసారి నిరాశే ఎదురైంది. దసరా బరిలో ఆచార్య రిలీజ్ దాదాపు లేనట్లుగానే తెలుస్తోంది. ఈ సినిమా పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో దసరా బరిలో నుండి ఈ సినిమా తప్పుకుంది. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఆసక్తి సన్నగిల్లుతుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఆచార్య చిత్రం కోసం ప్రేక్షకులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారని, ఇంకా వారిని వెయిట్ చేయించడం సినిమాకు మంచిది కాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా ఆచార్య చిత్ర యూనిట్ ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ క్లారిటీ ఇస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పూజా హెగ్డేలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.