ముగిసిపోయిందనుకున్న టాలీవుడ్ర డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చి తీవ్ర కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్కు చెందిన 12 మందికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటీసులు జారీ చేసి.. విచారణ షురూ చేసింది. ఇప్పటికే డైరెక్టర్ పూరీ జగన్నాథ్, హీరోయిన్ కమ్ నిర్మాత ఛార్మి కౌర్ను ఈడీ విచారించింది.
అయితే ఈ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. శుక్రవారం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈడీ ముందుకు రానున్నారు. నిజానికి ఆమె ఈనెల 6వ తేదీన విచారణకు వెళ్లాల్సి ఉంది. కానీ, వరుస షూటింగులతో ఫుల్ బిజీగా ఉన్నానని.. కొంత గడువు ఇవ్వాలని అధికారులను కోరిందట రకుల్. అందుకు ఈడీ అధికారులు అస్సలు ఒప్పుకోలేదు.
దాంతో ముందుగా వచ్చేందుకు రెడీ అంటూ అధికారులకు మరో రిక్వెస్ట్ సెండ్ చేశారు రకుల్. ఇందుకు సమ్మతించిన ఈడీ.. శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు ఎంక్వైరీకి హాజరు కావాలంటూ రిప్లై ఇచ్చారు. ఈ క్రమంలోనే రకుల్ ఈడీ విచారణలో నేడే పాల్గొననుంది.