టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ తాజా చిత్రం `అనుభవించు రాజా`. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా టీజర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు.
గోదావరి జిల్లాల్లో జరిగే కోడి పందేలు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. అచ్చం ఆ బ్యాక్ డ్రాప్లోనే ఈ సినిమా తెరకెక్కుతుందని టీజర్ బట్టీ అర్థం అవుతోంది. కోడిపందెలు అంటే ఆసక్తి కనబరిచే బంగారం అనే యువకుడి పాత్రలో రాజ్తరుణ్ కనిపించనున్నారు.
`అయినా బంగారం గాడు ఊర్లోనీ, ఆడి పుంజు బరిలోనీ ఉండగా, ఇంకో పుంజు గెలవడం కష్టమెహె..` అనే డైలాగ్ తో పూల రంగడు గెటప్ లో… రాజ్ తరుణ్ ఎంట్రీ అదిరిపోయిందని చెప్పాలి. గోదారి జిల్లా వాళ్ల ఎటకారం, అక్కడి నేటివిటీ.. టీజర్ లో కనిపించింది. మొత్తానికి ఆకట్టుకుంటున్న ఈ టీజర్ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేసింది. కాగా, ఈ సినిమాలో కషికా ఖాన్ హీరోయిన్గా నటిస్తోంది. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.