భార‌త్‌లో 31,923 క‌రోనా కేసులు.. మ‌ర‌ణాలెన్నంటే?

ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. అయితే ఇప్పుడిప్పుడే క‌రోనా ఉధృతి నెమ్మ‌దిస్తోంది. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి.

అయితే గ‌త కొద్ది రోజుల నుంచీ మాత్రం రోజూవారీ కేసులు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 31,923 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసుల‌తో దేశ‌వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,35,63,421 కు చేరుకుంది. అలాగే నిన్న 282 మంది క‌రోనా కార‌ణంగా మృత్యువాత ప‌డ‌గా.. దేశంలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 4,46,050 కు పెరిగింది.

ఇక నిన్న ఒక్క‌రోజే 31,990 మంది కోలుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో కరోనా నుంచి 3,28,15,731 మంది హాస్ప‌ట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్ర‌స్తుతం 3,01,604 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. కాగా, దేశ‌వ్యాప్తంగా నేటి వ‌ర‌కు 83,39,90,049 క‌రోనా వ్యాక్సిన్ డోసులు వేశాలు.