ప్రభాస్ తో ఆ కోరిక తీరుతుందో లేదో అంటున్న కంగనా..?

ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన కంగనారనౌత్ బాలీవుడ్ లో వరుసగా మూవీ ఆఫర్లతో బిజీగా ఉంది. ఇక ఈమె నటించిన తలైవి సినిమా ఈ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే ఈమె మాట్లాడుతూ.. కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది.. ప్రభాస్ తో కలసి తెలుగులో ఏక్ నిరంజన్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కంగనా, బాక్సాఫీసు వద్ద అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.అందుకే ఈమెకు తెలుగులో ఆఫర్లు రాలేదు.

కానీ తమిళ్ లో జయం రవి కి జోడిగా ధూమ్ ధామ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశం వచ్చింది. ఇక ఈ సినిమా కూడా ఆశించిన అంత సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ కు మకాం మార్చింది. ఇకపోతే బాలీవుడ్లో వరుస సినిమాలతో మంచి హీరోయిన్గా గుర్తింపు పొందిన ఈమె , ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంటోంది. అయితే తెలుగులో తనకు చాన్స్ ఇచ్చిన పూరి జగన్నాథ్ ను మరొక అవకాశం ఇవ్వమని అడుగుతున్నట్లు కంగనా తెలిపింది.

కేవలం ప్రభాస్ తోనే మరొక సినిమా చేసే అవకాశం ఇవ్వాలని కంగన కోరింది.. కాకపోతే కంగన కోరికను పూరి జగన్నాథ్, ప్రభాస్ లు తీరుస్తారో.. లేదో..మనం వేచిచూడాల్సిందే.. ఇకపోతే ఆమె అభిమానులు మోడీ హయాంలోనే కాకుండా కాంగ్రెస్ హయాంలో కూడా అవార్డులను అందుకుంది..ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది అని వారు చెబుతున్నారు.