శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహా సముద్రం`. ఇన్టెన్స్ లవ్, యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 14న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇక ఇటీవల విడుదల ట్రైలర్ సూపర్ రెస్పాన్స్ను దక్కించుకోవడంతో పాటుగా సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఓటీటీ డీల్ కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.
ప్రముక ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మహా సముద్రం డిజిటల్ హక్కులను భారీ రేటుకి కొనుగోలు చేసింది. వినిపిస్తున్న లేటెస్ట్ సమాచారం ప్రకారం.. రూ.11 కోట్లకు డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఇక థియేటర్లో విడుదలైన తర్వాత మహా సముద్రం నెట్ ఫ్లిక్స్లో అలరించనుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.