గోవాకు ప‌య‌న‌మ‌వుతున్న బాల‌య్య‌..ఎందుకోస‌మంటే?

నంద‌మూరి బాల‌కృష్ణ‌ గోవాకు ప‌య‌న‌మ‌వుతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో `అఖండ‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా న‌టిస్తుండ‌గా.. సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Nandamuri Balakrishna shoots 'Akhanda' climax in Tamil Nadu

ఈ సినిమా మేజర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. ఇక ఒక‌ షెడ్యూల్ మాత్ర‌మే మిగిలి ఉండ‌గా.. అందులో ఒక సాంగ్ తో పాటు కొన్ని సీన్స్ మాత్ర‌మే బ్యాలెన్స్ ఉన్నాయ‌ట‌. అయితే ఈ షెడ్యూల్ మ‌రో రెండు రోజుల్లో గోవాలో ప్రారంభం కానుంద‌ట‌.

Action Overdose In Balakrishna's Akhanda?

ఈ నేప‌థ్యంలోనే బాల‌య్య మ‌రియు బోయ‌పాటి టీమ్ గోవాకు వెళ్లబోతున్నార‌ట‌. అక్క‌డ అందమైన ప్రదేశాల్లో హీరోహీరోయిన్లపై కొన్ని సీన్స్ షూట్ చేయనున్నార‌ని తెలుస్తోంది. కాగా, భారీ అంచ‌నాలు ఉన్న ఈ చిత్రంలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.