ఇటీవల విడుదలై సూపర్ హిట్ అందుకున్న మలయాళ చిత్రం `దృశ్యం 2`ను అదే టైటిల్తో తెలుగులోనూ రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ రీమేక్లో విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్స్టార్ లో డైరెక్ట్ రిలీజ్ కానుందని జోరుగా ప్రచారం జరిగింది.
అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. దృశ్యం 2 మేకర్స్ ఓటీటీ డీల్ను క్యాన్సిల్ చేసుకున్నారట. థియేటర్లోనే సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. ఇందులో భాగంగానే దృశ్యం 2ను దసరా బరిలో నిలపాలని డిసైడ్ అయిన మేకర్స్.. అక్టోబర్ 13న రిలీజ్కు డేట్ లాక్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే నిజానికి అక్టోబర్ 13న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్ విడుదల కావాల్సి ఉంది. కానీ, పలు కారణాల వల్ల ఆ చిత్రం వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ను దృశ్యం 2 రీప్లేట్ చేయాలనుకుంటుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకనట కూడా రానుందని టాక్. కాగా, ఈ చిత్రాన్ని సురేష్ బాబు, ఆంటోనీ పెరుంబవూర్, రాజ్ కుమార్ సేతుపతి సంయుక్తంగా నిర్మించారు.