చైతు కోసం రంగంలోకి దిగిన చిరు.. అందుకోసమేనా?

నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్ లుగా నటించిన సినిమా లవ్ స్టోరీ. ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత వస్తున్న సినిమా కావడంతో లవ్ స్టోరీ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల సాయిపల్లవి కాంబినేషన్ లో మరోసినిమా వస్తుండటం తో అభిమానులు కూడా అదే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలకు తగ్గట్టుగానే ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మూవీ పై మరింత హైప్ ను క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఆ హైప్ ని మరింత రెట్టింపు చేయడానికి మెగాస్టార్ చిరంజీవి రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. లవ్ స్టోరీ సినిమా ఈ నెల 24న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 19న మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీగా ప్లాన్ చేశారు మూవీ మేకర్స్. ఇక ఈ వేడుకకు ముఖ్య అతిధిగా చిరంజీవి రానున్నట్లు సమాచారం. చిరంజీవి నాగార్జున ఎంత మంచి ప్రేమ అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే నాగార్జున ఫ్యామిలీ కు సంబంధించిన పలు ఈవెంట్స్ కు హాజరైన చిరంజీవి మరొకసారి స్నేహితుడు కొడుకు సినిమా ఫంక్షన్ కి రాబోతున్నాడని సమాచారం. చిరంజీవితో పాటు నాగార్జున కూడా ఈ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారని తెలుస్తోంది