ఈ హిట్ చిత్రానికి సీక్వెల్‌గా చ‌రణ్-శంక‌ర్ మూవీ..త్వ‌ర‌లోనే..?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌బోతున్నారు.

Ram Charan to star in Shankar's next pan-India film | Celebrities News – India TV

అలాగే స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎస్‌.త‌మ‌న్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట తెగ చక్క‌ర్లు కొడుతోంది. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా తెర‌కెక్క‌బోతున్న ఈ మూవీ ఓ హిట్ చిత్రానికి సీక్వెల్ అట‌. ఇంత‌కీ ఆ హిట్ చిత్రం ఏదో కాదు యాక్ష‌న్ హీరో అర్జున్‌- శంక‌ర్ కాంబోలో వ‌చ్చిన `జెంటిల్‌మేన్‌`.

Gentleman | Full Length Telugu Movie | Arjun | Madhoo | TeluguOne - YouTube

డైరెక్ట‌ర్ శంక‌ర్‌కు తొలి చిత్ర‌మైన జెంటిమేన్ 1993లో విడుద‌లైన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను శంక‌ర్ చ‌ర‌ణ్‌తో తెర‌కెక్కిస్తున్నాడ‌ని ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. మ‌రి ఇది ఎంత వ‌ర‌కు నిజ‌మో త్వ‌ర‌లోనే తెలియ‌నుంది.