పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన తప్పు మహేష్కు, రవితేజకు కలిసిరావడం ఏంటా..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. పవన్ హీరోగా `బద్రి` సినిమాను తెరకెక్కించి టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు పూరీ జగన్నాథ్. తొలి సినిమాతోనే బ్లక్ బస్టర్ హిట్ అందుకున్న పూరీ.. మళ్లీ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్తో `కెమెరామెన్ గంగతో రాంబాబు` మూవీ తీశాడు.
అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ రెండు సినిమాల మధ్యలో పూరీ-పవన్ కాంబోలో మరో మూడు సినిమాలు తెరకెక్కిల్సింది ఉంది. అవును, బద్రి హిట్ తర్వాత పూరీ పవన్ దృష్టిలో ఉంచుకుని `ఇడియట్` కథ రాసి ఆయనకు వినిపించాడు. పవన్కు కథ బాగా నచ్చినప్పటికీ.. సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపలేదు. దాంతో పూరీ జగన్నాథ్ రవితేజతో ఇడియట్ తీసి మాస్ మహారాజాకు స్టార్ ఇమేజ్ను అందించాడు.
ఆ తర్వాత `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి` కథను పూరీ పవన్ కోసమే రసి వినిపించగా.. దానినీ ఆయన ఓకే చేయలేదు. ఈ చిత్రంలోనూ రవితేజనే నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇక మహేష్ బాబుకు సూపర్ స్టార్ హోదాను అందించిన ‘పోకిరి’ సినిమా కథను సైతం పూరీ పవన్ కోసమే రాయగా..దాన్ని కూడా ఆయన టేకప్ చేయలేదు. మొత్తానికి పూరీ చెప్పిన మూడు బ్లాక్ బస్టర్ హిట్ కథలనూ వదులుకుని పవన్ తప్పు చేయడంతో.. రతితేజ, మహేష్లకు స్టార్ డమ్ తీసుకొచ్చాయి.