అతను ఎవరో తెలియదు అంటున్న ఛార్మి ..

టాలీవుడ్ లో ఇప్పుడు ఎక్కువగా సంచలనం సృష్టించిన విషయం డ్రగ్స్ కేసులో విచారణ. టాలీవుడ్ లో కొంతమంది స్టార్స్ ను డ్రగ్స్ కేసులో విచారణ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే టాలీవుడ్ కు చెందిన 12 మందికి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఈడి నోటీసులు ఇవ్వడం జరిగింది.

అందులో ఛార్మీని కూడా ఈడి అధికారులు విచారించడం జరిగింది. ఈ విచారణలో అన్ని విధాలా సహకరిస్తానని ఛార్మి తెలియజేసింది. ఇక ఈడీ అధికారులు అడిగిన వెంటనే తన అకౌంట్ వివరాలను ఇచ్చానని ఛార్మి తెలియజేసింది. కెల్విన్ ఎవరో తనకు తెలియదని ఛార్మి అధికారులకు తెలియజేసింది.

ఇక తనకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ ను అందజేసినట్లు ఛార్మి తెలియజేసింది. ఇక అందులో ఆమెకు సంబంధించిన 2 బ్యాంకు ఖాతాల లావాదేవీలు పరిశీలించారు ఈడి అధికారులు. 2016 లో కెల్విన్ తో మాట్లాడిన కాల్స్ డేటా.. వాట్స్అప్ చాట్ లో ఛార్మికి చూపించారు అధికారులు. అయితే ఆమె కెల్విన్ ఎవరో నాకు తెలియదని ఛార్మి అధికారులకు తెలియజేసింది. ఇక అంతే కాకుండా కెల్విన్ తో పాటు మరో ముగ్గురు ఫోటోలను కూడా ఛార్మికి చూపించారు.