నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఇక ఈ మూవీ తర్వాత బాలయ్య.. తన 107వ చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో చేయబోతున్నాడు.
ఈ చిత్రం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నిర్మితం కానుంది. అయితే త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో బాలయ్యను ఢీ కొట్టే విలన్గా తమిళ స్టార్ హీరో విజయ్ సేతిపతి నటించబోతున్నాడట.
ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని.. విజయ్ బాలయ్యకు విలన్గా నటించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ప్రచారమే నిజమైతే.. దబిడి దిబిడే అంటున్నారు నందమూరి ఫ్యాన్స్. కాగా, గోపీచంద్ మాలినేని సినిమా తర్వాత బాలయ్య.. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో ఓ మూవీ చేయనున్న విషయం తెలిసిందే.