ఒకే స్క్రీన్‌పై ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ‌..అస‌లు మ్యాట‌రేంటంటే?

ప్ర‌భాస్‌, విజ‌య్ దేవ‌ర‌కొండ ఒకే స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నారా..? అంటే అవున‌న్న‌ మాటే వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. ప్ర‌భాస్‌, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బ‌డ్జెట్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా ప‌దుకోణె హీరోయిన్‌గా న‌టిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.

Nag Ashwin promises two big updates on his film with Prabhas. Fans go berserk - Movies News

ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం.. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టంట వైర‌ల్‌గా మారింది. సైన్స్ ఫిక్షన్ క‌థ నేప‌థ్యంలోనే తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ప్ర‌భాస్‌తో పాటుగా మ‌రో ఇద్ద‌రు స్టార్ హీరోలు కూడా క‌నిపించ‌నున్నార‌ట‌.

WOW! After Mahesh Babu, 'Arjun Reddy' star Vijay Devarakonda to play Chief Minister on the big screen?

ఆ ఇద్ద‌రు స్టార్ హీరోల్లో ఒక‌రు విజ‌య్ దేవ‌ర‌కొండ కాగా.. మ‌రొక‌రు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. వీరిద్ద‌రూ ప్రాజెక్ట్ కెలో గెస్ట్ రోల్ లో క‌నిపించ‌బోతున్నాడ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాలంటే.. మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

Dulquer Salmaan apologises to Tamilians for 'Varane Avashyamund' scene | Bollywood – Gulf News