ప్రభాస్, విజయ్ దేవరకొండ ఒకే స్క్రీన్పై కనిపించనున్నారా..? అంటే అవునన్న మాటే వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో `ప్రాజెక్ట్ కె` పేరుతో భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దీపికా పదుకోణె హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం.. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టంట వైరల్గా మారింది. సైన్స్ ఫిక్షన్ కథ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్తో పాటుగా మరో ఇద్దరు స్టార్ హీరోలు కూడా కనిపించనున్నారట.
ఆ ఇద్దరు స్టార్ హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ కాగా.. మరొకరు మలయాళ హీరో దుల్కర్ సల్మాన్. వీరిద్దరూ ప్రాజెక్ట్ కెలో గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.