టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ కేసులో ఈడి నోటీసులు ..?

ఈ మధ్య కాలంలో ఉన్న సెలబ్రిటీస్ ఎక్కువగా డ్రగ్స్ వాడుతున్నారని వినిపిస్తోంది. ఇతర భాషల్లో నటిస్తున్నటువంటి స్టార్ హీరో హీరోయిన్ లకు కూడా ఈడీ నోటీసులు కూడా పంపించారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మన టాలీవుడ్ లో కూడా ఇలాంటి సిచువేషన్ ఎదురయింది. అదేమిటంటే డ్రగ్స్ కేసులో మన టాలీవుడ్ లో టాప్ హీరో హీరోయిన్లు, డైరెక్టర్లకు కూడా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. వారు ఎవరు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టాలీవుడ్ లో బాగా పాపులర్ అయినటువంటి నటులు డ్రగ్స్ వ్యవహారం నడుపుతున్నట్లు పలువురు నటీనటులు వార్తల్లోకి వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు కూడా వారందరికీ ఈడి నోటీసులు జారీ చేసింది. ఇక ఆ లిస్టులో చార్మి, రకుల్ ప్రీతిసింగ్, రవితేజ, తరుణ్, దగ్గుబాటి రానా, నవదీప్, ముమైత్ ఖాన్, నందు శ్రీనివాసులకు కూడా ఈడి నోటీసులు పంపించింది.

చాలా రోజుల తర్వాత ఇలా ఈడీ నోటీసులు పంపించడంతో తదుపరి చర్యలపై చాలా ఉత్కంఠ నెలకొంటుంది. అయితే ఈ వ్యవహారం ఇంకా ఎంత ముందుకు వెళ్తుందో వేచి చూడాల్సిందే. అయితే ఈ విషయంపై మన స్టార్ హీరో హీరోయిన్లు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం.