చరణ్ కథను కొట్టేసిన యష్ ..!

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ హీరోలైన వారిలో కేజిఎఫ్ హీరో యాష్ కూడా ఒకరు.ఈయన కేజిఎఫ్ సినిమా తో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఈ సినిమాతోనే ఫాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు యాష్ .ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తున్నది ఏమిటంటే.. డైరెక్టర్ బోయపాటి శీను తో త్వరలో సినిమాని నిర్మించబోతున్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.

ఇక రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన చిత్ర వినయ విధేయత రామ.ఈ సినిమా కంటే ముందు ఒక కథని రామ్ చరణ్ కు వినిపించగా ఆ కథ బాగాలేదు అనడంతో ఆ కథను వదిలేశాడు. కానీ రామ్ చరణ్ వదిలేసిన సినిమానే ఇప్పుడు యాష్ కు తెలియజేశారు ఆన్నట్లుగా ఎక్కువగా వినిపిస్తోంది.ఇక అంతే కాకుండా వినయ విధేయత రామ భారీ అంచనాల మధ్య విడుదలైన,అది భారీ డిజాస్టర్ ను చవిచూసింది.

ఇక రామ్ చరణ్ కు ముందు వినిపించిన కథను బాగుండడంతో ఎప్పటికైనా ఈ కథ చేద్దామని బోయపాటి శీను తో అంటుండేవాడట రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ షెడ్యూల్స్ ఖాళీ లేకపోవడంతో బోయపాటి శ్రీను తో సినిమా రావాలంటే చాలా కాలం ఎదురు చూడాల్సి వస్తుంది.అందుచేతనే ఈ సినిమాని యాష్ కి చెప్పినట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగా తను కథ ను కూడా మార్చాడు అన్నట్లుగా సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

అంతేకాకుండా డైరెక్టర్ పూరి జగన్నాథ్-హీరో యాష్ కాంబినేషన్లు ఒక సినిమా రావాల్సి ఉండగా, అనుకోని కారణాల చేత అగిపోయినట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది.