తమన్నా.. పరిచయం అవసరంలేని పేరు. దాదాపు 15 ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్గా కెరీర్ను కొనసాగిస్తున్న ఈ మిల్కీ బ్యూటీ.. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు హోస్ట్గా కూడా మారింది. ఇంటర్నేషనల్ లెవల్లో పాపులర్ అయిన మాస్టర్ చెఫ్ అనే కుక్కింగ్ షో తెలుగు వర్షన్కు తమన్నా హోస్ట్గా వ్యవహరించబోతుంది.
తర్వాలోనే ఈ షో ప్రసారం కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకుంది. ముఖ్యంగా తనకు ఫుడ్ అంటే ప్రాణమని.. అందులోనూ తెలుగు వంటకం చేపల పులుసు అంటే మహా ఇష్టమని.. దాని కోసం పడి చచ్చిపోతానని తమన్నా చెప్పుకొచ్చింది. అలాగే హైదరాబాద్ బిర్యానీని కూడా ఇష్టంగా తింటానని.. ఇక స్వీట్లలో పూతరేకులు ఇష్టమని తెలిపింది.
అయితే తినడమే కానీ… ఏ వంటకాన్నీ వండే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో వంట చేస్తానంటే అమ్మ అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే నా వంట మీద ఇంట్లో వాళ్లకు అంతగా నమ్మకం. ఇక ఈ కుకింగ్ షోను హోస్ట్ చేయటం వల్ల నాకు వంటలపై అవగాహన ఏర్పడింది. స్వయంగా వండగలననే నమ్మకం వచ్చింది. ఇకపై గరిట తిప్పాలనుకుంటున్నా. నా వంటకు మొదట బలయ్యేది నా కుటుంబసభ్యులే అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.