టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో మహేష్ తన 28 చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్తో ప్రకటించాడు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అతడు, ఖలేజా సినిమాల తర్వాత మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తుండటంతో ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నేడు మహేష్ బర్త్డే సందర్భంగా.. ఈ సినిమా క్యాస్టింగ్ను ఓ వీడియో రూపంలో చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ చిత్రంలో మహేష్ సరసన మరోసారి బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.
అలాగే ఎ.ఎస్.ప్రకాశ్ ఆర్ట్ డైరక్టర్గా, నవీన్ నూలి ఎడిటర్గా, మధి సినిమాటోగ్రాఫర్గా, థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరించబోతోన్నారని తాజాగా విడుదల చేసిన వీడియోలో ప్రకటించారు. కాగా, మహేష్-పూజా హెగ్డే జంటగా మహర్షి చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జోడీ కట్టబోతున్నారు.