ఆర్జీవీపై విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ సెన్సేషనల్ కామెంట్స్ వైరల్…!

తెలుగు సినీ చరిత్రలో కాసులు కొళ్లగొట్టే డైరెక్టర్ ఎవన్నా ఉన్నారంటే వెంటనే టక్కున అది రాజమౌళియే అని చెబుతారు. ఆయన ఏ సినిమా చేసిన అది ఓ అద్బుతంగా ఉంటుంది. మరి అలాంటి సినిమాలకు కథను అందించేది స్వయానా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్. తన కథలతో ఎంతో మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. తాజాగా ఆయన సునీల్ సినిమా ఈవెంట్ కు హాజరయ్యారు. హీరో సునీల్ కనబడుటలేదు అనే సినిమాను తీస్తున్నాను.

ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్ కు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా వచ్చారు. అందులో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ స్టేజీపైకు వచ్చాక ఆర్జీవీ ఓ ఫ్యాషన్ ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు తీశాడని, ఆయన ఇప్పుడు కనపడుటలేదని చమత్కరించాడు. దీంతో ఆర్జీవీ నవ్వులు పూయించాడు. ఈ నెల 13న సునీల్ సినిమా విడుదలకానుంది. ప్రస్తుతం విజయేంద్ర ప్రసాద్ ఆర్జీవీ గురించి చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి.