రాశీ ఖన్నా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `మనం` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ..`ఊహలు గుసగుసలాడే` సినిమా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు దక్కించుకున్న రాశీ.. తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది.
ఇక కెరీర్ మొదటల్లో బొద్దుగా ఉన్న ఈ ముద్దుగుమ్మ.. ఈ మధ్య బాగా సన్నబడి తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ బిజీగా ఉన్నప్పటికీ రాశీఖన్నా.. ద్యాసంతా వెకేషన్లపైనే ఉంది. చివరకు నిద్రలో కూడా వెకెషన్ గురించే ఆలోచిస్తుందట. ఈ విషయం ఎవరో కాదు.. ఆమెనే ఇన్స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ ద్వారా తెలియజేసింది.
ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ మూవీ షూటింగ్లో రాశీ ఖన్నా పాల్గొంటోంది. అయితే షూటింగ్ గ్యాప్లో కుర్చిపైనే కునుకు తీసింది రాశీ. అంతేకాదు అందుకు సంబంధించిన ఓ ఫొటోను ఇన్స్ట్రాలో పోస్ట్ చేస్తూ.. ‘షూటింగ్ గ్యాప్ల మధ్యలో ఇలా నిద్రపోతుంటాను. నిద్రలో వెకేషన్ గురించి కలలు కంటుంటాను’ అని ఆసక్తికరమైన క్యాప్షన్ను రాసుకొచ్చింది. మొత్తానికి వెకేషన్ అంటే రాశీ ఎంతో ఇష్టమో ఈ పోస్ట్ బట్టీ స్పష్టంగా అర్థం అవుతోంది.
https://www.instagram.com/p/CTCOmzGB228/?utm_source=ig_web_copy_link