ఈ మధ్య కాలంలో తెలుగు ఇండస్ట్రీలో లీకుల బెడద బాగా ఎక్కువైపోయింది. బడా హీరోల సినిమాలే కాదు చిన్న హీరోల సినిమాలు లీకుల బారిన పడుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎన్ని చర్యలు తీసుకున్నా…లీకుల వీరులు షాక్ ఇస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయంలో మాత్రం ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన `రాధేశ్యామ్` చిత్రం మాత్రం సేఫ్గానే ఉందని చెప్పాలి.
ఈ వింటేజ్ ప్రేమకథా చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ బ్యానర్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే ఇప్పటి వరకు ఈ చిత్రాన్ని లీకుల వీరులు టచ్ చేయలేకపోవడం విశేషం.
ప్రస్తుతం చూసుకున్నట్టయతే మన టాలీవుడ్ లో ఉన్న ఇతర స్టార్ హీరోలందరి సినిమాల నుంచీ లీక్స్ బయటకి వచ్చేస్తున్నాయి. పుష్ప, సర్కారు వారి పాట, ఆచార్య, ఆర్ఆర్ఆర్ ఇలా అన్ని సినిమాల నుంచి ఫొటోలు, వీడియోలో లీక్ అవుతూనే ఉన్నాయి. కానీ, రాధే శ్యామ్ నుంచి మాత్రం చిన్న లీక్ కూడా రాలేదు. ఈ లెక్క ప్రొడెక్షన్ వారు ఎంత రాధేశ్యామ్ విషయంలో ఎంత కేర్గా ఉన్నారో స్పష్టంగా అర్థమవుతోంది.