జాతీయ జెండాకు అవ‌మానం..రామ్ చ‌ర‌ణ్‌పై నెటిజ‌న్లు ఫైర్‌!?

ఒక్కో సారి త‌ప్పు చేయ‌క‌పోయినా.. అంద‌రి చేత మాట‌లు ప‌డుతుంటాం. ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు కూడా అలాంటి ప‌రిస్థితే ఎదురైంది. జాతీయ జెండాను అవ‌మానించాడంటూ ప‌లువురు నెటిజ‌న్లు చ‌ర‌ణ్‌పై ఫైర్ అవుతున్నారు. ఇంత‌కీ అస‌లు ఏం జ‌రిగిందంటే.. రామ్ చ‌ర‌ణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న వాటిలో `హ్యాపీ మొబైల్స్` ఒక‌టి.

Image

అయితే నేడు 75వ స్వాతంత్య్ర దినోత్సవం సంద‌ర్భంగా.. సదరు హ్యాపీ మొబైల్స్ వారు రామ్ చరణ్‌తో ఫుల్ పేజీ పేపర్ యాడ్స్ ఇచ్చారు. ఈ ప్రకటనలో రామ్ చరణ్ వైట్ డ్ర‌స్ ధ‌రించి జాతీయ పతాకం ఎగరవేసినట్టు ఓ ఫోటో ఉంది. అయితే చ‌ర‌ణ్ ప‌ట్టుకున్న జెండాలో అశోక ధర్మచక్రం లేదు. ఇంకేముందు.. ఖాళీగా ఉన్న కొంద‌రు నెటిజ‌న్లు జాతీయ జెండాను అవ‌మానించాడంటూ చ‌ర‌ణ్‌పై ట్రోల్ చేయ‌డం స్టార్ట్ చేశారు.

Image

అయితే ఇది గ‌మ‌నించిన స‌ద‌రు హ్యాపీ మైబైల్స్ సంస్థ‌.. అంద‌రికీ ఓ క్లారిటీ ఇచ్చింది. వ్యాపార ప్రకటనల కోసం జాతీయ జెండాను వాడటం నేర‌మ‌ని.. అందుకే త‌మ ప్ర‌క‌ట‌న‌కు జాతీయ పతాకాన్ని పోలి ఉండే త్రివర్ణ పతాకాన్ని వాడుకున్నామ‌ని తెలిపారు. చ‌ర‌ణ్ ప‌ట్టుకున్న‌ది జాతీయ జెండా కాద‌ని.. అందువ‌ల్ల‌నే అందులో అశోక ధర్మ చక్రం లేదని వివరణ ఇచ్చారు.