సమంత అక్కినేని.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. సమంత ఇటు సినిమాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు వ్యాపార రంగంలోనూ దూసుకుపోతోంది. ఏకమ్ లర్నింగ్ అనే స్కూల్తో పాటు సాకీ అనే దుస్తుల లేబుల్ను సమంత సక్సెస్ ఫుల్ రాన్ చేస్తోంది. ఇక ఈమెనే కాకుండా తమన్నా, కాజల్, రకుల్ వంటి తారలు కూడా ఓవైపు సినిమాలు, మరోవైపు వ్యాపారాలు చేస్తున్నారు.
అయితే ఇప్పుడు వీరి రూట్లోనే కీర్తి సురేష్ కూడా పయనించబోతోంది. మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. కొత్త వ్యాపారం స్టార్ట్ చేసింది. `భూమిత్ర` బ్రాండ్ పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసి..మిత్రులు శిల్పారెడ్డి, కాంతిదత్తో కలిసి స్కిన్ కేర్ ఉత్పత్తుల తయారీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ సందర్భంగా కీర్తి సురేస్ మాట్లాడుతూ..ప్రకృతి సిద్ధమైన ఔషధాలతో సౌందర్యాన్ని మెరుగుపరిచే విధంగా స్కిన్ కేర్ ఉత్పత్తులను పెద్దఎత్తున తయారు చేస్తున్నట్లు తెలిపారు. మరి కొత్త బిజినెస్ ప్రారంభించిన కీర్తి ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి. కాగా, కీర్తి ప్రస్తుతం మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాతో పాటు చిరంజీవి చెల్లెలుగా భోళా శంకర్ మూవీలో నటిస్తోంది. అలాగే తమిళ, మలయాళ భాషల్లో కూడా ఆమె సినిమాలో చేస్తోంది.