మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, దర్శకుడు దేవా కట్టా కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రిపబ్లిక్`. ఈ చిత్రంలో ఐశ్వర్యా రాజేశ్ హీరోయిన్గా నటిస్తుండగా.. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే జేబీ ఎంటర్టైన్మెంట్స్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలె షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ సినిమా పూర్తిగా ప్రజాస్వామ్యం నేపథ్యంలోనే తెరకెక్కుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయగా.. రిపబ్లిక్ నుంచి తాజాగా జగపతిబాబును `దశరథ్` పాత్రలో పరిచయం చేస్తూ లుక్ను విడుదల చేశారు.
`దీపాలు పోరాటం ఆపినప్పుడే చీకటి గెలుస్తుంది` అనే క్యాప్షన్ ను కూడా ఈ లుక్ పోస్టర్లో చూపించారు. మొత్తానికి అదిరిపోయిన ఈ పోస్టర్.. నెట్టింట వైరల్గా మారింది. కాగా, ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.