ఏపీలో కొత్త‌గా 1,413 క‌రోనా కేసులు..మ‌రింత దిగొచ్చిన మ‌ర‌ణాలు!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..సెకెండ్ వేవ్ రూపంలో చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రిపై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే మ‌ళ్లీ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డుతున్నారు. క‌ర‌నా ఉధృతి క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి అనుకుంటున్న త‌రుణంలో.. మ‌ళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతూ వ‌స్తున్నాయి.

అయితే నిన్న మాత్రం క‌రోనా టెస్ట్‌లు త‌క్కువ‌గా నిర్వ‌హించ‌డం వ‌ల్ల‌.. రోజూవారీ కేసులు త‌క్కువ‌గా న‌మోదు అయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,413 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో అత్య‌ధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 458 కేసులు, అతి స్వ‌ల్పంగా కర్నూలు జిల్లాలో 9 కేసులు న‌మోదు అయ్యాయి.

దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 19,83,721 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 18 మంది మృత్యువాత ప‌డ్డారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 13,549 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 1,795 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,50,623 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 19,549 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, నిన్నొక్క రోజే రాష్ట్ర‌వ్యాప్తంగా 54,455 క‌రోనా టెస్ట్‌లు నిర్వ‌హించారు.