బాలీవుడ్ స్టార్ హీరోయిన్, రణ్వీర్ సింగ్ భార్య దీపిక పదుకోనె తల్లి కాబోతోందనే వార్త ప్రస్తుతం నెట్టంట వైరల్గా మారింది. ఉన్నట్టు ఉంది ఈ ప్రచారం జగడానికి కారణం లేకపోలేదు. రణవీర్, దీపిక శుక్రవారం సాయంత్రం ముంబైలోని హిందూజా ఆసుపత్రి నుండి బయటకు వస్తూ మీడియా కంట పడ్డారు.
దాంతో దీపికా ప్రెగ్నెంట్ అనీ, అందుకే చకప్ కోసం భర్తతో హాస్పటల్కి వెళ్లిందనే ప్రచారం ఊపందుకుంది. మరి తాజా ప్రచారం ఎంత వరకు నిజమో తెలియంటే.. దీపిక స్పందించాల్సిందే. కాగా, 2018 నవంబర్లో ఇటలీలోని లేక్ కోమోలో పెద్దల సమక్షంలో కొంకిణీ సంప్రదాయం ప్రకారం రణవీర్, దీపిక వివాహం చేసుకున్నారు.
అయితే పెళ్లి తర్వాత కూడా దీపిక వరున సినిమాలు చేస్తూ.. తన కెరీర్ను సక్సెస్ ఫుల్గా కొనసాగిస్తోంది. త్వరలోనే ఈ భామ టాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. నాగ్ అశ్విన్, ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో దీపికా హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది.