పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయి పల్లవి..

టాలీవుడ్ లో అచ్చు తెలుగమ్మాయి ఎవరంటే ప్రస్తుతం సాయిపల్లవి అనే చెబుతారు. అయితే ఈమె ప్రేమమ్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక ఫిదా సినిమా తో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ రేంజ్ ను అందుకుంది సాయిపల్లవి. అయితే ప్రస్తుతం సాయి పల్లవి ఒక పాన్ ఇండియా మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆ మూవీ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

 

సాయి పల్లవి తన డాన్స్ తో, పల్లెటూరి భాషతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. ఈమె తెలుగు, తమిళ భాషల్లో కూడా ఎన్నో సినిమాల్లో నటిస్తోంది. తమిళ నిర్మాత సంస్థ”డ్రీమ్ వారియర్ బ్యానర్” పై ఒక లేడీ ఓరియంటెడ్ సినిమాకు సైన్ చేసినట్లు, సినీ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. సాయి పల్లవి ఎప్పుడూ కొత్త రకంగా కనిపించాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమాని ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని తమిళ్, తెలుగులో కూడా విడుదల చేయబోతున్నట్లు చెబుతున్నారు. ఈ సినిమాకి గౌతం రామచంద్రం డైరెక్టర్ గా చేయబోతున్నారు. ఇక ఈ సినిమా స్టోరీ చాలా విభిన్నంగా ఉంటుందనే నమ్మకం వారు వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు , ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఈ సినిమాను 2022 వ సంవత్సరంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో కూడా ఈమె నటిస్తున్నది. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక అంతే కాకుండా సాయి పల్లవి, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం”లవ్ స్టోరీ” సినిమా కూడా అతి త్వరలోనే మన ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమాలు హిట్ అయితే సాయి పల్లవి మరింత ముందుకు వెళుతుందని సినీ ఇండస్ట్రీలో వినికిడి.