టాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్లు అతి చిన్న వయసులో నుంచి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఒక స్టార్ హీరోయిన్ గా ఎదిగిన హీరోయిన్ తను చిన్న వయసులో రాజశేఖర్ తోనే నటించి. మరి పెద్దయిన తర్వాత హీరోయిన్ గా నటించింది. ఆ నటి గురించి ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
సినిమాలో చాలా మంది హీరోలు వేరు వేరు పాత్రలతో నటిస్తుంటారు.కొంతమంది అన్నా చెల్లెలు గానుకనిపించవచ్చు. లేదా మామా అల్లుళ్లు గా కనబడతారు. మరికొందరు బావ బామ్మర్ది గాను కనిపిస్తారు. చెప్పాలంటే ఇలాంటి పాత్రలు ఎన్నో వేస్తుంటారు. బడిపంతులు సినిమా లో ఎన్టీఆర్ కు మనవరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఎన్నో సినిమాలలో ఆయనతో జత కట్టింది.
ఇక ఇలాంటి అద్భుతమే రాజశేఖర్ సరసన సుహాసిని నటించింది. వీరిద్దరి కూతురి గా రాశి ( చైల్డ్ ఆర్టిస్ట్ )గా సినిమాలో నటించింది.అంతేకాకుండా 1999 సంవత్సరంలో రాజశేఖర్ హీరోగా ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో నేటి గాంధీ సినిమా లో హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాతోనే ఈమె రాజశేఖర్ తో నటించింది. ప్రస్తుతం రాశి సీరియల్స్ లో నటిస్తున్నట్లు సమాచారం.