ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్తో లైగర్ సినిమా చేస్తున్న టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. ఓ వెబ్సిరీస్పై మనసు పారేసుకున్నారు. ఇంతకీ ఆ సిరీస్ ఏదో కాదు..కుడి ఎడమైతే. అమలాపాల్, రాహుల్ విజయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను పవన్ కుమార్ తెరకెక్కించాడు.
టైమ్ లూప్ కాన్సెప్ట్తో రూపుదిద్దుకున్న ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో విడుదలై విశేస ఆదరన పొందింది. అయితే తాజాగా ఈ సిరీస్ చూసిన విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియా వేదికగా రివ్వూ ఇచ్చాడు. ఇప్పుడే కుడిఎడమైతే సిరీస్ను చూశాను. ఈ వెబ్సిరీస్ చాలా నచ్చింది. అమలాపాల్, రాహుల్ విజయ్ నటన ఆకట్టుకుందని అన్నారు.
అలాగే ఇప్పటి వరకు వచ్చిన వాటిలో ఇది ఒక బెస్ట్ సిరీస్ అన్నారు విజయ్. అలాగే సిరీస్ 2 కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇక విజయ్ దేవరకొండ వ్యాఖ్యలతో.. ఈ సిరీస్ చూసేందుకు మరికొందరు ఆసక్తి కనబరుస్తున్నారు.
https://twitter.com/TheDeverakonda/status/1418445687637770240?s=20