తెలుగులో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్రముఖ నటి స్నేహా.. 2012లో తమిళ నటుడు ప్రసన్నను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లై, పిల్లు పుట్టినా కూడా.. వీరిద్దరూ కెరీర్ను కొనసాగిస్తూనే ఉన్నారు.
ముఖ్యంగా ఈ జంట నటించే యాడ్స్కు సూపర్ డిమాండ్ ఉందని చెప్పాలి. అందుకే వీరితో యాడ్స్ తెరకెక్కించేందుకు పలు కంపెనీలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తారట. ఇప్పటి వరకు ఈ జంట కంఫర్ట్ ఫాబ్రిక్, ఆశీర్వాద్, విమ్ బార్, జి.ఆర్.టి జ్యుయలర్స్, సన్ ఫీస్ట్ మ్యారి లైట్ ఇలా ఎన్నో యాడ్స్లో కనిపించారు.
అలాగే స్నేహా సోలోగా ఆశీర్వాద్ గులాబ్జామ్, వైభవ్ కలెక్షన్స్ లాంటి యాడ్స్లో మెరిసింది. మరో విషయం ఏంటంటే.. కేవలం యాడ్స్ ద్వారానే ఈ క్యూట్ కపుల్ రూ. 3.5 కోట్లు సంపాదిస్తారట. ఇక సినిమాల విషయానికి వస్తే.. స్నేహా సెకెండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసి పలు చిత్రాల్లో సహాయనటిగా నటిస్తోంది. అలాగే ప్రసన్న కూడా తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు.