సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ సాయి కుమార్.. నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్.. భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుక జరుపుకున్నారు.
అయితే కరోనా కారణంగా దగ్గర బంధువులు, సన్నిహితల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. సాయి కుమార్ దంపుతల షష్టిపూర్తికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజశేఖర్ దంపతులతో సహా చాలా మంది సెలబ్రిటీస్ విచ్చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటుల నెట్టింట వైరల్గా మారాయి. కాగా, ప్రస్తుతం పలు సినిమాల్లో సహాయ నటుడిగా నటిస్తున్న సాయి కుమార్.. మరోవైపు పలు టీవీ షోలకు హోస్ట్గా వ్యవహరిస్తూ బుల్లితెరపై దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇక ఆయన తనయుడు ఆది సాయి కుమార్ వరుస సినిమాలు చేస్తూ.. భారీ హిట్ కొట్టేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాడు.