రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇటలీ బ్యాక్డ్రాప్లో సాగే పీరియాడిక్ ప్రేమకథగా రానున్న ఈ మూవీకి రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదా లు కలిసి భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ మూవీ మోషన్ పోస్టర్ గతేడాది అక్టోబర్లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మోషన్ పోస్టర్ యూట్యూబ్లో 21 మిలియన్లకు పైగా వ్యూస్ను రాబట్టింది. ఇండియన్ సినిమాల్లో ఓ మోషన్ పోస్టర్ అత్యధిక వ్యూస్ రాబట్టడం ఇదే తొలిసారి.
దాంతో భారత్ సినీ చరిత్రలో మోషన్ పోస్టర్ ద్వారా అత్యధిక వ్యూస్ రాబట్టిన తొలి చిత్రంగా రాధేశ్యామ్ నిలిచి రికార్డు సృష్టించింది. ఇక రాధేశ్యామ్ క్రియేట్ చేసిన ఈ అరుదైన రికార్డుతో.. ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా, షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.