అక్కినేని నటవారసుడు అఖిల్ అక్కినేని ఇప్పటి వరకు మూడు సినిమా చేశాడు. కానీ, ఒక్కటీ హిట్ కాలేదు. నాల్గొవ చిత్రం బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీ చేశారు. షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన. ఇక ఐదో చిత్రం స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో చేస్తున్నారు.
ఈ మూవీలో ఏజెంట్ అనే టైటిల్ను కూడా ఖరారు చేశారు. ఏ.కె. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇక ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా ప్రచారం నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే మొదట ఆ పాత్ర కోసం కింగ్ నాగార్జునను సంప్రదించారట మేకర్స్.
కానీ, నాగ్ కావాలనే ఆ రోల్ చేయనని సున్నితంగా చెప్పారట. అఖిల్ సినిమాలో నాగ్ నటిస్తే ప్రేక్షకుల ఫోకస్ అంతా ఆయనపైనే పడుతుంది. అందువల్లనే నాగ్ ఈ ఆఫర్కు నో చెప్పారట. దాంతో మేకర్స్ మమ్ముట్టిని మీట్ అయ్యి.. ఆయననే ఫైనల్ చేసినట్టు వార్తలు వస్తున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో త్వరలోనే తెలియనుంది.