ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి ప్రాజెక్ట్ను స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు.
ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండీ.. అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విషయంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం.. ఈ చిత్రం కోసం ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు లైన్లో ఉన్నారట. ఇందకీ వారెవరో కాదు.. ఆలియా భట్ మరియు కియారా అద్వానీలు.
వీరిద్దరిలోనే ఎవరో ఒకరిని ఫైనల్ చేయనున్నారని జోరుగా ప్రచారం నడుస్తోంది. అయితే కియారాతో చరణ్ ఇప్పటికే వినయ విధేయ రామ చేశారు. అలాగే ఆలియాతో ఆర్ఆర్ఆర్ చేస్తున్నాడు. మరి తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వీరిద్దరిలో చరణ్ ఎవరికో ఓటేస్తాడో చూడాల్సి ఉంది.